తెలంగాణ

telangana

ETV Bharat / state

రానున్న రోజుల్లో 47 డిగ్రీలకు పెరిగే అవకాశం - HEAT_WAVES

తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురువారం 46 డిగ్రీలతో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ఈ ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో 47 డిగ్రీలకు పైగా పెరగనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

రానున్న రోజుల్లో 47 డిగ్రీలకు పెరిగే అవకాశం

By

Published : May 10, 2019, 5:32 AM IST

Updated : May 10, 2019, 8:25 AM IST

రానున్న రోజుల్లో 47 డిగ్రీలకు పెరిగే అవకాశం

రాష్ట్ర వ్యాప్తంగా భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. 46 డిగ్రీల మేర గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఉష్ణోగ్రతలు మరో మూడు రోజుల పాటు నమోదవుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులు ఎక్కువగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్పా బయటకు రావద్దని సూచిస్తున్నారు.
తెలంగాణలో గురువారం రోజు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బయ్యారంలో 46.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. అత్యల్పంగా నారాయణ పేట, కామారెడ్డిలో 40 డిగ్రీలు రికార్డు అయ్యాయి. అలాగే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూర్‌, జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం రాజారాంపల్లి, ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం, పెద్దపల్లి జిల్లా జూలపల్లిలలో 46.4 డిగ్రీలు నమోదు అయ్యాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఘణపూర్‌ మండలం చిల్పూర్‌లో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.
రాబోయే రోజుల్లో 47 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవడంతో పాటు వడగాల్పులు అధికంగా వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: 'ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించాలి'

Last Updated : May 10, 2019, 8:25 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details