భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలానికి చెందిన ఓ బాలికను సమీప గ్రామానికి చెందిన ముత్తయ్య అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబరుచుకున్నాడు. అనంతరం సదరు యువకుడు ఆ బాలికను పెళ్లి చేసుకునేందుకు మొహం చాటేశాడు.
మైనర్ బాలికను మోసం చేసిన యువకుడు
మైనర్ బాలికను నమ్మించి మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకొని మోసం చేశాడో ప్రబుద్ధుడు. తీరా పెళ్లి గురించి అడిగేసరికి ముఖం చాటేశాడు. చేసేదేమి లేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
మైనర్ బాలికను మోసం చేసిన యువకుడు
బాధితురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మణుగూరు ఏఎస్పీ శబరిష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలికకు న్యాయం చేయాలని మహిళసంఘం సభ్యులు కోరారు.