తెలంగాణ

telangana

By

Published : May 7, 2020, 3:27 PM IST

ETV Bharat / state

ఆదిలాబాద్​లో రిమ్స్​ నర్సుల ఆందోళన

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆదిలాబాద్​ రిమ్స్​ నర్సులు ఆందోళన చేపట్టారు. ఐసోలేషన్​ వార్డులో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ప్రత్యేక సెలవులు ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అనంతరం రిమ్స్​ డైరెక్టర్​ రాఠోడ్​ వచ్చి సర్ది చెప్పడం వల్ల వారు ఆందోళన విరమించారు.

ఆదిలాబాద్​లో రిమ్స్​ నర్సుల ఆందోళన
ఆదిలాబాద్​లో రిమ్స్​ నర్సుల ఆందోళన

ఆదిలాబాద్​లోని రాజీవ్​ గాంధీ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెడికల్​ సైన్సెస్​ ( రిమ్స్ ) నర్సులు ఆందోళన బాట పట్టారు. న్యాయం చేయాలంటూ డైరెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఐసోలేషన్ వార్డులో విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ ప్రత్యేక సెలవులు ఇవ్వడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. మాస్కులు, బ్లౌజులు ఇవ్వడం లేదని తెలిపారు.

విధులకు హాజరయ్యేటప్పుడు డైరెక్టర్ ఛాంబర్​లోకి వచ్చి సంతకం పెట్టాలని కొత్త నిబంధన పెట్టారని... ఇదెక్కడి న్యాయం అంటూ వాపోయారు. అనంతరం డైరెక్టర్ రాఠోడ్ వచ్చి ఆందోళన చేస్తున్న నర్సులను సముదాయించడం వల్ల వివాదం సద్దుమణిగింది.

ఇదీ చూడండి:హైదరాబాద్​లో అప్రమత్తంగా ఉండాలి: సీఎం కేసీఆర్​

ABOUT THE AUTHOR

...view details