తెలంగాణ

telangana

ETV Bharat / sports

వాలీబాల్​ ఫైట్​: పాక్​తో అమీతుమీకి భారత్​ సిద్ధం - Coach Pritam Singh Chauhan.

భారత వాలీబాల్​ జట్టు మరో బిగ్​ ఫైట్​కు రెడీ అవుతోంది. ఆసియా పురుషుల అండర్​-23 ఛాంపియన్​షిప్​లో భాగంగా నేడు పాకిస్థాన్​తో తలపడనుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్​ఫైనల్​ మ్యాచ్​లో ఆస్ట్రేలియాపై 3-1 తేడాతో గెలుపొందింది భారత జట్టు.

వాలీబాల్​ ఫైట్​: పాక్​తో అమీతుమీకి భారత్​ సిద్ధం

By

Published : Aug 10, 2019, 1:50 PM IST

ఆసియా పురుషుల అండర్​-23 వాలీబాల్​ ఛాంపియన్​షిప్​లో నేడు రసవత్తర పోరు జరగనుంది. మయన్మార్​ వేదికగా జరుగుతోన్న టోర్నీలో తొలిసారి సెమీస్​ చేరిన భారత జట్టు... పాక్​తో తాడోపేడో తేల్చుకోనుంది.

శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన క్వార్టర్స్​లో విజయం సాధించింది భారత్​. మ్యాచ్​లో తొలిసెట్​ 16-25 తేడాతో కోల్పోయినా.. తర్వాత పుంజుకొని 25-19, 25-21 , 27-25 తేడాతో మిగతా మూడు సెట్లు కైవసం చేసుకుంది భారత ఫుట్​బాల్​ జట్టు.

ఆస్ట్రేలియాతో పోటీ పడుతున్న భారత ఆటగాళ్లు(తెలుపు దుస్తులు)

అమిత్​ గులియా సారథ్యంలో భారత జట్టు ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. లీగ్​ దశలో బలమైన చైనా, న్యూజిలాండ్​ జట్లను ఓడించింది భారత్​.

" కుర్రాళ్లు సూపర్​ ప్రదర్శన చేశారు. మొదటి రౌండ్లో మంచి ఆరంభం లభించకపోయినా తర్వాత సెట్​ నుంచి బాగా ఆడారు. ఆస్ట్రేలియా లాంటి బలమైన ప్రత్యర్థిని ఓడించడం గొప్ప విజయం. ఈ గెలుపుతో ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. నేడు పాకిస్థాన్​తో జరగనున్న మ్యాచ్​పై ఎక్కువ దృష్టి పెట్టాం. ఇప్పటికే నాకౌట్​ దశ దాటిన మేము... మరింత రాణించాలని అనుకుంటున్నాం".
-- ప్రీతమ్​ సింగ్​, భారత అండర్​-23 వాలీబాల్​ కోచ్​

మరో రెండు క్వార్టర్స్ మ్యాచ్​ల్లో చైనా జట్టుపై చైనీస్​ తైపీ, శ్రీలంక జట్టుపై జపాన్ గెలిచి సెమీఫైనల్​ చేరాయి.

ABOUT THE AUTHOR

...view details