'ది హండ్రెడ్' టోర్నీలో పాల్గొనడానికి భారత మహిళ క్రికెటర్లకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్ఓసీ)ను జారీ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). స్మృతి మంధాన, హర్మన్ప్రీత్ కౌర్, జెమియా రోడ్రిగ్స్, దీప్తి శర్మలకు ఈ సర్టిఫికెట్లను ఇచ్చింది. ఈ లీగ్ను ఇంగ్లాండ్ వేదికగా గతేడాది నిర్వహించతలపెట్టారు. కానీ, కొవిడ్ కారణంగా ఆ టోర్నీ వాయిదా పడింది.
బీసీసీఐ అనుమతితో ఈ జూన్-జులైలో యూకే వేదికగా జరిగే ఒక టెస్టు, మూడు వన్డేలు, మరికొన్ని టీ20ల్లో ఆడటానికి అవకాశం ఉంది.
ఇదీ చదవండి:ఐపీఎల్-14లో రీఎంట్రీ ఇవ్వనున్న అశ్విన్!