ఇండోర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో.. ఇన్నింగ్స్ 130 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది టీమిండియా. ఈ గెలుపుతో రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది కోహ్లీసేన. మూడో రోజైన శనివారం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన బంగ్లాదేశ్ 69.2 ఓవర్లకు 213 పరుగులకే కుప్పకూలింది.
భారత బౌలర్ల హవా...
భారత బౌలర్లలో మహ్మద్ షమీ నాలుగు వికెట్లు తీసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. 16 ఓవర్ల బౌలింగ్లో 7 మెయిడిన్లు సాధించాడీ బౌలర్. ఇతడికి తోడు రవిచంద్రన్ అశ్విన్ మూడు, ఉమేశ్ యాదవ్ రెండు, ఇషాంత్ శర్మ ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
మయాంక్ మరోమారు..
ఇండోర్ వేదికగా గురువారం(నవంబర్ 14న) ప్రారంభమైన మొదటి టెస్టులో.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీ(243) సాధించాడు.మూడు టెస్టుల వ్యవధిలో రెండు ద్విశతాలు బాదేశాడీ కర్ణాటక ప్లేయర్. రహానే(86) సహా జడేజా, పుజారా చెరో అర్ధశతకంతో రాణించారు. ఫలితంగా రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది. అదే స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది కోహ్లీసేన.
ఆరంభమే ఫేలవంగా...
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా జట్టు.. ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది. ఆరో ఓవర్లో ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో ఇమ్రుల్ (6) బౌల్డయ్యాడు. ఆ తర్వాత ఇషాంత్ బౌలింగ్లో మరో ఓపెనర్ షాద్మాన్ ఇస్లామ్(6) పెవిలియన్ చేరాడు. తర్వాత వచ్చిన మొమినుల్ హక్(7), మిథున్(18)లు వెంటవెంటనే ఔటయ్యారు.
ముష్ఫికర్ ఒంటరి పోరాటం