తెలంగాణ

telangana

By

Published : Oct 12, 2019, 12:24 PM IST

ETV Bharat / sports

వైరల్: బౌండరీ వెళ్లినా పరుగు ఆపని బ్యాట్స్​మెన్

ఆస్ట్రేలియాలోని ఓ దేశవాళీ మ్యాచ్​లో వినోదాత్మక సన్నివేశం చోటుచేసుకుంది. షఫీల్డ్​ షీల్డ్ పేరుతో జరుగుతోన్న ఫస్ట్​క్లాస్​ టోర్నీలో ఓ ఆటగాడు కొట్టిన బంతి బౌండరీ చేరింది. అయినా పరుగు ఆపలేదు ఆ బ్యాట్స్​మెన్. ఈ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

బౌండరీ వెళ్లినా పరుగాపని బ్యాట్స్​మెన్​... వీడియో వైరల్​

క్రికెట్​ మైదానంలో ఆటగాళ్లు చేసే అల్లరి, వారి చేష్టలు ఒక్కోసారి నవ్వు తెప్పిస్తుంటాయి. ఇలాంటి ఓ సంఘటనే ఆస్ట్రేలియాలో జరుగుతోన్న షఫీల్డ్​ షీల్డ్​ టోర్నీలో చోటుచేసుకుంది. ఓ బ్యాట్స్​మెన్​ కొట్టిన బంతి బౌండరీ దాటినా, అతడు పరుగు తీయడం ఆపలేదు. వికెట్ల మధ్య పరుగెడుతున్న అతడ్ని చూసి మరో బ్యాట్స్​మెన్ ఆశ్చర్యపోయాడు. కామెంటేటర్లు అయితే విపరీతంగా నవ్వుతూ... ఎనిమిది పరుగులు చేయాలని సరదాగా వ్యాఖ్యానించారు.

షఫీల్డ్​ షీల్డ్​ దేశవాళీ టోర్నీలో ఆరు జట్లు తలపడతాయి. ఈ జాబితాలో విక్టోరియా, న్యూ సౌత్​వేల్స్​, టాస్మానియా, క్వీన్స్​లాండ్​, దక్షిణ​ ఆస్ట్రేలియా, పశ్చిమ ఆస్ట్రేలియా ఉన్నాయి. ఈ ఏడాది యాషెస్​ టోర్నీలో పరుగుల విధ్వంసం సృష్టించిన స్టీవ్​ స్మిత్​... న్యూసౌత్​ వేల్స్​ తరఫున బరిలోకి దిగాడు. తొలి మ్యాచ్​లోనే అతడు డకౌట్​ కావడం పెద్ద చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి...

ABOUT THE AUTHOR

...view details