ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. ఇందులో రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, చెన్నై సూపర్ కింగ్స్ సారథి ధోనీ సరికొత్త మైలురాళ్లను దాటనున్నారు.
- ఈ సీజన్తో ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. 200 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి రోహిత్, ధోనీ సరసన చేరనున్నాడు. ఇప్పటివరకు రోహిత్ 200 ఐపీఎల్ మ్యాచ్లు ఆడగా.. ధోనీ 204 మ్యాచ్లు ఆడాడు. 200 మ్యాచ్లకు కోహ్లీ 8 మ్యాచ్ల దూరంలో ఉన్నాడు.
- ఐపీల్లో ఇప్పటివరకు నాలుగు సెంచరీలు చేసిన కోహ్లీ.. అత్యధిక సెంచరీలు చేసిన క్రిస్ గేల్ రికార్డును చేరుకునే వీలుంది. గేల్ ఇప్పటివరకు ఆరు సెంచరీలు చేశాడు. కోహ్లీ ఈ సీజన్లో రెండు సెంచరీలు చేస్తే గేల్ను సమం చేస్తాడు.
- స్టైక్ రేట్ను పెంచుకునే అవకాశం కూడా కోహ్లీకి ఉంది. ఇప్పటివరకు 2016లో అత్యధికంగా 152.03 స్టైక్ రేట్ను నమోదు చేశాడు కోహ్లీ. ఆ తర్వాత నుంచి అతని స్టైక్ రేట్ తగ్గి.. ఇటీవల మళ్లీ పెరుగుతోంది.