తెలంగాణ

telangana

By

Published : Aug 9, 2019, 10:41 AM IST

ETV Bharat / sports

లద్దాఖ్​లో జెండా ఎగరవేయనున్న ధోనీ..!

భారత క్రికెటర్​ ధోనీ అరుదైన ఘనత సొంతం చేసుకోనున్నాడు. ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన నూతన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్​లో... జాతీయ జెండా ఎగురవేయనున్నట్లు సమాచారం. ఆగస్ట్​ 15న లెఫ్టినెంట్ ​కల్నల్​ హోదాలో ఈ కార్యక్రమానికి హాజరుకానున్నాడు.

లద్దాఖ్​లో జెండా ఎగురవేయనున్న లెఫ్టినెంట్​ కల్నల్​ ధోనీ..!

భారత సైన్యంలో లెఫ్టినెంట్​ కల్నల్​గా గౌరవ హోదాలో ఉన్న ధోనీ.. మరో అరుదైన అవకాశం పొందనున్నాడు. కొద్దిరోజులుగా జమ్ముకశ్మీర్​లో సైన్యంలో విధులు నిర్వర్తిస్తోన్న మహీ... త్వరలో లద్దాఖ్​లో భారత త్రివర్ణ పతాకం ఎగురవేయనున్నాడు. ఆగస్ట్ ​15న జెండావందనం రోజు మహీకి ఈ అవకాశం దక్కనుంది. అయితే ఈ విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

మహేంద్రసింగ్​ ధోనీ

గ్రామాల్లో రెపరెపలే...

జమ్ము కశ్మీర్​కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసి, కశ్మీర్​, లద్దాఖ్​ను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించింది భారత ప్రభుత్వం. ఇప్పటివరకు ఆ ప్రాంతాల్లో ప్రత్యేక జెండా ఉండేది. ఆగస్ట్​ 15న ప్రతి గ్రామంలో భారత జెండా ఎగురవేయాలని నిర్ణయించింది మోదీ ప్రభుత్వం.

అదృష్టమే...

ప్రపంచకప్​లో సెమీస్​లో టీమిండియా ఓటమి తర్వాత ధోనీ రిటైర్మెంటుపై విపరీతంగా చర్చ జరిగింది. ఆ సమయంలో అనూహ్యంగా రెండు నెలలు ఆటకు విరామం ప్రకటించాడీ 38 ఏళ్ల వికెట్​ కీపర్​. అనంతరం జులై 30న టెరిటోరియల్​ ఆర్మీలో చేరిన మిస్టర్​ కూల్​... దక్షిణ కశ్మీర్​లో ప్రస్తుతం విధుల్లో ఉన్నాడు. అక్కడి నుంచి ఆగస్ట్​ 10న తన బృందంతో లద్దాఖ్​లోని లేహ్​కు పయనమవనున్నాడు. ఒకవేళ లద్దాఖ్​లోనే స్వాతంత్ర్య దినోత్సవం వరకు ఉంటే ఆ ప్రాంతంలోనే త్రివర్ణ పతాకం ఎగురవేయనున్నాడు.

లెఫ్టినెంట్​ కల్నల్​ హోదాలో ధోనీ

ప్రస్తుతం భారత సైన్యానికి బ్రాండ్​ అంబాసిడర్​గా ఉన్నాడు ధోనీ. గౌరవ హోదాలో ఉన్న అతడు ప్రత్యేక వసతులు కోరుకోకుండా... యూనిట్​లోని సభ్యులతో సాధారణంగా ఉంటున్నాడు. జవాన్లకు ప్రేరణ కల్పించడం, శిక్షణ తరగతుల నిర్వహణ, పహారా వంటి విధులు నిర్వర్తిస్తున్నాడు. తోటి జవాన్లతో కలిసి వారితో పాటే బ్యారాక్​ల్లోనే ఉంటూ కలిసి తినడం, కలిసి ఆడిన ఫొటోలు ఇటీవల నెట్టింట విపరీతంగా చక్కర్లు కొట్టాయి. ఆగస్ట్​ 15 వరకు ఈ బాధ్యతల్లోనే ఉండనున్నాడు మహీ.

సాధారణ జవాన్​లా...

ఇవీ చూడండి...

ABOUT THE AUTHOR

...view details