మూడేళ్ల తర్వాత తొలిసారి భారత క్రికెట్ నియంత్రణ మండలి సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎమ్) జరగనుంది. నూతన అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ నాయకత్వంలో డిసెంబరు 1న ముంబయిలో బీసీసీఐ అధికారులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో కొన్ని కీలక సవరణలు చేసే ఆలోచనలో ఉన్నారు.
ప్రస్తుత నియమాల ప్రకారం నూతన అధ్యక్షుడిగా గంగూలీ.. బీసీసీఐ అధ్యక్ష పదవిని 9 నెలలే నిర్వహిస్తాడు. అయితే ఏజీఎమ్లో సౌరభ్ కాలపరిమితిని పెంచేందుకు బీసీసీఐ రాజ్యంగాన్ని సవరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా బీసీసీఐ సభ్యుడి కాలపరిమితి ఆరేళ్లు ఉంటుంది. మరోసారి చేయాలంటే ముడేళ్లు విరామం ఉండాలనే నిబంధన ఉంది. దీనిని తొలగించనున్నట్లు సమాచారం.