ఆఖరి టీ-20లోనూ వెస్టిండీస్కు నిరాశే ఎదురైంది. 3 మ్యాచ్ల టీ-20 సిరీస్ను భారత్ క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం గయానా వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 147 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించింది కోహ్లీ సేన. రిషభ్ పంత్(65 నాటౌట్; 42 బంతుల్లో), విరాట్ కోహ్లీ(52; 45 బంతుల్లో) అర్ధశతకాలతో రాణించారు. దీపక్ చాహర్కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సిరీస్ మొత్తం ఆల్రౌండ్ ప్రతిభ కనబర్చిన కృనాల్ పాండ్యకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ దక్కింది.
పొలార్డ్ ఒక్కడే...
తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి.. 146 పరుగులు చేసింది. తొలుత 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కరేబియన్ జట్టును పొలార్డ్(58; 45 బంతుల్లో) ఆదుకున్నాడు. నాలుగో వికెట్కు పూరన్తో కలిసి 66 పరుగులు జోడించి.. ఐదో వికెట్గా వెనుదిరిగాడు. చివర్లో పావెల్(20 బంతుల్లో 32) మెరుపులు మెరిపించగా ఆ మాత్రం స్కోరైనా సాధించింది.