బాలీవుడ్లో విజయవంతమైన జంట టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ జంట మరోసారి కలిసి నటించనుంది. మొదటి బాఘీ చిత్రంలో కూడా వీరు కలిసి నటించారు.
"సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. 'బాఘీ' కుటంబంతో మరోసారి కలుస్తున్నందుకు ఆనందంగా ఉంది. నిర్మాత షాజిద్తో నాకు ఇది మూడో సినిమా, టైగర్ ష్రాఫ్తో రెండోది, దర్శకుడు అహ్మద్ ఖాన్తో మొదటి చిత్రం " -శ్రద్ధాకపూర్
'బాఘీ 2' కి దర్శకత్వం వహించిన కొరియోగ్రాఫర్, డైరక్టర్ అహ్మద్ ఖాన్ ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు.
'బాఘీ' ఫ్యామిలీకి శ్రద్ధా తిరిగి వస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఇద్దరి జంట చాలా బాగుంటుంది. ఈ చిత్రం మరోసారి అభిమానుల్ని అలరించడం ఖాయమని చిత్ర నిర్మాత షాజిద్ నదియావాలా తెలిపారు.
ప్రస్తుతం శ్రద్ధా 'చిచ్చోరే', 'స్ట్రీట్ డాన్సర్' చిత్రాల్లో నటిస్తోంది. 'బాఘీ 3'ని మార్చి 2020లో విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది.