తెలంగాణ

telangana

By

Published : Mar 31, 2020, 10:41 AM IST

ETV Bharat / sitara

సినిమాల్ని వదిలేద్దామనుకున్నా: సాయి పల్లవి

తన మాటలు, వేషధారణతో తక్కువ సమయంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. కానీ ఓ సమయంలో సినిమా రంగాన్ని వదిలేద్దామనుకుందట ఈ హీరోయిన్.

సాయి పల్లవి
సాయి పల్లవి

బుల్లితెరపై డ్యాన్సర్‌గా కెరీర్‌ ప్రారంభించి సినీ రంగ ప్రవేశం చేసింది సాయి పల్లవి. తనదైన వేషధారణ, మాటలతో అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ భాషల్లో అగ్ర కథానాయకుల సరసన అవకాశాలు దక్కించుకుంటోంది. మరి ఇలాంటి సాయి పల్లవి సినిమాలు వద్దు అని చెప్పిందంటే నమ్మగలమా!

తమిళ నటుడు సూర్యతో కలిసి సాయి పల్లవి నటించిన చిత్రం 'ఎన్​జీకే'. సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని ఓ సన్నివేశాన్ని పదే పదే రీషూట్‌ చేసేవాడట దర్శకుడు. దాంతో సినిమా రంగాన్ని వదిలేస్తానని వాళ్ల అమ్మకు చెప్పి ఏడ్చిందట సాయి పల్లవి. ఆ తర్వాత అనుకున్న ఔట్‌పుట్‌ వచ్చేందుకే దర్శకుడు అన్ని సార్లు చిత్రీకరిస్తున్నాడని తెలుసుకుంది. పాజిటివ్‌ ఆలోచనతో ముందుకు సాగింది.

ప్రస్తుతం రానా కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 'విరాటపర్వం' చిత్రంలో నటిస్తుంది సాయి పల్లవి. వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతోందీ సినిమా.

ABOUT THE AUTHOR

...view details