మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ నటి దియా మీర్జా పెళ్లికి సిద్ధమైందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ముంబయికి చెందిన వ్యాపారవేత్త వైభవ్ రేఖినీ ఫిబ్రవరి 15న వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. వీరు కొంతకాలంలో రిలేషన్షిప్లో ఉన్నట్లు కథనాలు వచ్చాయి.
అతి తక్కువ మంది అతిథుల మధ్య వీరి కల్యాణం జరగనుందని సమాచారం. దియాకు 2014లోనే సాహిల్ అనే వ్యక్తితో వివాహం జరగగా.. వారు 2019లో విడాకులు తీసుకున్నారు. వైభవ్ కూడా గతంలో సునైనా రేఖి అనే ఆమెను పెళ్లి చేసుకున్నారు.