2008లో దిల్లీలో జరిగిన ఎన్కౌంటర్ నేపథ్యంలో 'బాట్లా హౌస్' తెరకెక్కింది. ఆగస్టు 15న విడుదలవనున్న ఈ సినిమాను చూసేందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోసం ప్రత్యేక షో ఏర్పాటు చేసింది చిత్రబృందం.
'ఈ చిత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు చూపించడం గౌరవంగా భావిస్తున్నా. ఆయన ఎలా స్పందిస్తారో చూడాలని ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ఉపరాష్ట్రపతిని కలవాలని, మాట్లాడాలని ఎదురుచూస్తున్నా'. -జాన్ అబ్రహం, బాలీవుడ్ హీరో
నిఖిల్ అడ్వాణీ దర్శకత్వంలో వస్తోంది 'బాట్లా హౌస్'. ఈ సినిమాలో దిల్లీలో జరిగిన ఎన్కౌంటర్కు నాయకత్వం వహించిన డీసీపీ సంజీవ్ కుమార్ యాదవ్ పాత్రలో కనిపించనున్నాడు జాన్ అబ్రహం.