తెలంగాణ

telangana

By

Published : Dec 24, 2020, 8:05 PM IST

ETV Bharat / jagte-raho

ఆన్​లైన్ సూక్ష్మ రుణాల నిర్వాహకులకు రిమాండ్​

ఆన్​లైన్ సూక్ష్మ రుణాల నిర్వాహకులను సీసీఎస్ పోలీసులు రిమాండ్​కు తరలించారు. గురుగావ్​కు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసి స్థానిక న్యాయస్థానంలో హాజరుపర్చిన అనంతరం పీటీ వారెంట్​పై హైదరాబాద్​కు తీసుకొచ్చారు.

nampally court remand to online loan app accused's
ఆన్​లైన్ సూక్ష్మ రుణాల నిర్వాహకులకు రిమాండ్​

గురుగావ్​కు చెందిన ఐదుగురు ఆన్​లైన్ సూక్ష్మ రుణాల నిర్వాహకులను పోలీసులు అరెస్ట్​ చేశారు. అక్కడి న్యాయస్థానాల్లో హాజరుపర్చి పీటీ వారెంట్​పై హైదరాబాద్​కు తీసుకొచ్చారు. వారిని నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపర్చగా.. న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం వారిని చంచల్​గూడ జైలుకు తరలించారు.

చరవాణి అప్లికేషన్ల ద్వారా సులభంగా రుణాలు ఇస్తూ భారీ వడ్డీ వసూలు చేస్తున్న కేసులో సైబర్ క్రైం పోలీసులు రెండు రోజుల క్రితం ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఈ ఆరుగురు నిందితులను ఏడు రోజుల కస్డడీకి ఇవ్వాలని సైబర్ క్రైం పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ... సోమవారం విచారణకు రానుంది. ఆన్​లైన్​లో రుణాలు ఇస్తున్న 330 అప్లికేషన్లను సైబర్ క్రైం పోలీసులు గుర్తించి వాటిని తొలగించాల్సిందిగా గూగుల్ ప్లే స్టోర్​కు లేఖ రాశారు.

ఇదీ చదవండి:ఆన్​లైన్ లోన్ వేధింపులు.. బలవుతున్న యువత

ABOUT THE AUTHOR

...view details