తెలంగాణ

telangana

By

Published : Jun 1, 2019, 2:55 PM IST

ETV Bharat / jagte-raho

రోకలిబండతో భార్యను హత్యచేసిన భర్త

భర్తే భార్యను దారుణంగా హత్య చేసిన ఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలో వెల్దండలో చోటు చేసుకుంది.

రోకలిబండతో భార్యను హత్యచేసిన భర్త

నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామంలో దారుణం జరిగింది. భర్తే భార్య ను దారుణంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పెద్దాపూర్ గ్రామానికి చెందిన పల్లె శేఖర్​రెడ్డి, నాగ శ్రీతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరిద్దరికీ రెండేళ్ల పాప కూడా ఉంది. గత వారం రోజులుగా వీరిద్దరు గోడవపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున మరోమారు వీరి మధ్య గొడవ జరిగింది. రోకలిబండతో బలంగా నాగశ్రీ తలపై కొట్టాడు శేఖర్​. అక్కడికక్కడే ఆమె మృతి చెందగా.. వెంటనే వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు

రోకలిబండతో భార్యను హత్యచేసిన భర్త

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details