తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

బీటెక్​ విద్యార్థిని ఆత్మహత్య.. అనుమానాలు లేవన్న కుటుంబం! - suicide news in yadagirigutta

చెరువులో దూకి బీటెక్​ చదువుతోన్న యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన.. యాదగిరిగుట్టలో చోటుచేసుకుంది. యువతిపై శనివారం.. పట్టణ పోలీసు స్టేషన్​లో కేసు నమోదు కాగా ఆదివారం ఆమె మృతదేహం లభ్యమైంది.

young lady suicide, yadagirigutta
యువతి ఆత్మహత్య, నల్ల చెరువు, యాదగిరిగుట్ట

By

Published : Jan 10, 2021, 3:43 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని నల్లచెరువులో దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలు వలిగొండ మండలం లోతుకుంటకు చెందిన సుంకబుడ్డి అనూరాధగా పోలీసులు గుర్తించారు. శనివారం.. అనూరాధపై యాదగిరిగుట్ట పట్టణ పోలీస్​ స్టేషన్​లో మిస్సింగ్​ కేసు నమోదయింది. విచారణ చేస్తుండగా.. చెరువులో ఆమె మృతదేహం లభ్యమైంది.

పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శవపంచనామా అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా అనూరాధ మరణంపై కుటుంబీకులు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయలేదు.

ఇదీ చదవండి:పెళ్లి బృందంతో వెళ్తున్న ఆటో బోల్తా.. 12 మందికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details