కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై గల టోల్ ప్లాజా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టోల్ ప్లాజా వద్ద ఉన్న డివైడర్ను గమనించక పోవడంతో బైక్ అదుపుతప్పి కిందపడింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ.. బైక్పై నుంచి వెళ్లడంతో ఒకరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
అదుపుతప్పిన బైక్.. పైనుంచి వెళ్లిన లారీ..
డివైడర్కు తగిలి బైక్ అదుపుతప్పి కిందపడింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన లారీ.. బైక్పై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా భిక్నూర్ మండల పరిధిలో చోటుచేసుకుంది.
అదుపుతప్పిన బైక్.. పైనుంచి వెళ్లిన లారీ..
మృతి చెందిన వ్యక్తి ప్రకాశ్(28)గా, గాయపడిన రాజిరెడ్డి కామారెడ్డివాసులుగా గుర్తించారు. హైదరాబాద్ వైపు నుంచి వస్తుండగా ఘటన చోటుచేసుకుంది.
ఇదీ చూడండి: మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు... ఫిర్యాదు చేసిన మహిళ