తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఆర్టికల్​ 370 రద్దుతో సంబంధాలు మరింత బలహీనం' - పాకిస్థాన్​

ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్ముకశ్మీర్​ స్వయంప్రతిపత్తి తొలగించడాన్ని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ తీవ్రంగా తప్పుపట్టారు. ఇలాంటి నిర్ణయాలు అణుసామర్థ్యమున్న దేశాల మధ్య సంబంధాలను బలహీనపరుస్తాయని అభిప్రాయపడ్డారు.

'ఆర్టికల్​ 370 రద్దుతో సంబంధాలు మరింత బలహీనం'

By

Published : Aug 6, 2019, 6:01 AM IST

ఆర్టికల్​ 370 రద్దుపై పాకిస్థాన్​ విషం కక్కుతోంది. జమ్ముకశ్మీర్​కు స్వయం ప్రతిపత్తిని రద్దు చేయాలన్న భారత్​ నిర్ణయాన్ని పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​ ఖండించారు. ఇలాంటి చర్యల వల్ల అణు సామర్థ్యం ఉన్న భారత్​- పాక్​ దేశాల మధ్య సంబంధాలు మరింత బలహీనపడతాయన్నారు.

ఆర్టికల్​ 370ను రద్దు చేస్తున్నట్టు రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ప్రకటించారు. రాష్ట్రాన్ని.. జమ్ముకశ్మీర్​, లద్దాఖ్​ అని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించాలని బిల్లు ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చల అనంతరం సంబంధిత బిల్లు, తీర్మానానికి ఆమోదం లభించింది.

అంతకుముందే భారత్​ నిర్ణయాన్ని పాక్​ విదేశాంగశాఖ కార్యాలయం ఖండించింది. త్వరలో పాక్​లో పర్యటించే అమెరికా బృందం, అంతర్జాతీయ సంఘం వద్ద ఈ సమస్యను ప్రస్తావిస్తామని తెలిపింది.

భారత హైకమిషనర్​కు సమన్లు...

ఆర్టికల్​ 370 రద్దు నేపథ్యంలో భారత్​ హైకమిషనర్​ అజయ్​ బిసారియాకు పాక్​​ సమన్లు జారీ చేసింది. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. భారత్​ నిర్ణయం.. అంతర్జాతీయ చట్టాలు, ఐరాస తీర్మానాలకు విరుద్ధంగా ఉందని ఆరోపించింది పాక్​.

ABOUT THE AUTHOR

...view details