కరోనా రాకాసి వైరస్ ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తోంది. ఇందుకు సంబంధించిన తాజా గణాంకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు విడుదల చేశారు.
చైనాలో పరిస్థితి ఏంటి?
కరోనా వల్ల ఇప్పటివరకు 722 మరణాలు సంభవించాయి. 34,546 మంది వైరస్ బారిన పడ్డారు. హంకాంగ్లో 25, మకావ్లో 10 కేసులు నమోదయ్యాయి. చైనాలోని హుబే రాష్ట్రంలో వైరస్ కారణంగా ఎక్కువ మంది మృతి చెందారు. ఇక్కడే తొలిసారి కరోనా వైరస్ను గుర్తించారు.
ఏ దేశాల్లో ఎంతమందిపై ప్రభావం..
-జపాన్ : 89
-సింగపూర్ : 33
-థాయ్ల్యాండ్ : 32
-దక్షిణ కొరియా : 24
-ఆస్ట్రేలియా : 14
-జర్మనీ : 13
-అమెరికా : 12
-తైవాన్ : 16
-మలేషియా : 15
-వియత్నాం : 13