తెలంగాణ

telangana

ETV Bharat / international

'అమెరికా సైనికులు అందరూ ఉగ్రవాదులే' - సులేమానీ అంత్యక్రియలు

అమెరికా దాడిలో మరణించిన ఇరాన్​ జనరల్​ ఖాసీం సులేమానీ అంత్యక్రియలు స్వస్థలం కర్మన్​లో జరిగాయి. వేలాది మంది ఇరానియన్లు ఆయనకు అశ్రునివాళి అర్పించారు. సులేమానీ హత్యకు కారణమైన అమెరికా సైనిక బలగాలు మొత్తాన్ని ఉగ్రవాదులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది ఇరాన్.

Iranians mass for funeral in hometown of general killed by US
సులేమానీకి వేలాది మంది ఇరాన్​వాసుల తుది వీడ్కోలు

By

Published : Jan 7, 2020, 12:59 PM IST

Updated : Jan 7, 2020, 2:06 PM IST

సులేమానీకి వేలాది మంది ఇరాన్​వాసుల తుది వీడ్కోలు

అమెరికా డ్రోన్​ దాడిలో మరణించిన ఇరాన్​ జనరల్​ ఖాసీం సులేమానీ అంత్యక్రియల్లో వేలాది మంది ఇరానియన్లు పాల్గొన్నారు. సులేమానీ స్వస్థలమైన కర్మన్​లో ఆయన అంతిమయాత్ర జరిగింది. ఆయనకు ప్రజలంతా కన్నీటి నివాళులర్పించారు.

గత శుక్రవారం బాగ్దాద్​ విమానాశ్రయంపై అమెరికా చేసిన డ్రోన్​ దాడిలో సులేమానీ చనిపోయారు. ఈ నేపథ్యంలోనే ఇరాన్​- అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ఓ వైపు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్​ అంటుంటే.. దాడికి పాల్పడితే కనీవినీ ఎరుగని రీతిలో సమాధానం చెప్తామని ట్రంప్​ హెచ్చరించారు.

వారంతా ఉగ్రవాదులే....

అమెరికాపై ప్రతీకార చర్యలు తప్పవని పదేపదే చెబుతున్న ఇరాన్​... మరో కీలక నిర్ణయం తీసుకుంది. సులేమానీ మృతికి కారణమైన అగ్రరాజ్య సైనికులు అందరినీ ఉగ్రవాదులుగా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది.

ఇదీ చూడండి: రూ.1,038 కోట్ల నల్లధనం బదిలీ గుట్టురట్టు

Last Updated : Jan 7, 2020, 2:06 PM IST

ABOUT THE AUTHOR

...view details