చైనాకు మాస్క్లతో పాటు అన్ని రకాల వ్యక్తిగత రక్షణ, కొన్ని వైద్య పరికరాలపై విధించిన నిషేధాన్ని భారత్ ఎత్తివేసింది. ప్రాణాంతక కరోనా వైరస్తో పోరాడుతున్న చైనాకు బాసటగా నిలిచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చైనాలోని భారత రాయబారి విక్రమ్ మిశ్రీ తెలిపారు.
కరోనా వైరస్పై సానుభూతి తెలుపుతూ చైనా అధ్యక్షుడు జిన్పింగ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాసిన ఒక్కరోజు అనంతరం.. అధికారులు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.