తెలంగాణ

telangana

ETV Bharat / international

మయన్మార్: సైన్యం కాల్పుల్లో మరో ఇద్దరు మృతి - మయన్మార్‌ ఆంక్షలు

మయన్మార్ సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా పౌరులు చేపడుతోన్న ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు భద్రతా బలగాలు చేస్తున్న ప్రయత్నాల్లో హింస తలెత్తుతోంది. తాజాగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరుల మృతితో మరింత ఆగ్రహం చెందిన ఆందోళనకారులు.. ప్రజాప్రభుత్వాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేస్తున్నారు.

2 Myanmar protesters killed by police fire, reports say
మయన్మార్ నిరసనలపై సైన్యం కాల్పులు.. ఇద్దరు మృతి

By

Published : Feb 20, 2021, 9:50 PM IST

మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనల్లో ఉద్రిక్తత నెలకొంది. దేశంలోనే రెండో ప్రధాన నగరం మాండలే‌లోని ఆందోళనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు చెందారు.

గాయపడిన వారిని తరలిస్తున్న అత్యవసర సిబ్బంది
సైన్యం కాల్పుల్లో గాయపడిన యువకుడు..
రబ్బరు బుల్లెట్లను చూపుతున్న ఆందోళనకారులు

ఘటనా స్థలంలోనే..

ఈ కాల్పుల్లో ఘటనా స్థలంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు ఆసుపత్రికి తరలించే క్రమంలో మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. నిరసనకారులను అదుపులోకి తెచ్చేందుకు గ్యాసు, రబ్బరు తూటాలను పోలీసులు ఉపయోగించారు. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా మయన్మార్‌ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఆందోళనకారులను నిలువరించేందుకు సైన్యం ఏర్పాటు చేసిన బారికేడ్లు
కవాతు నిర్వహిస్తున్న సైన్యం

ఆంక్షలను లెక్కచేయకుండా రోడ్లపైకి వస్తున్న ప్రజలు.. ప్రభుత్వ పునరుద్దరణతో పాటు, ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చదవండి:మయన్మార్: యువతి మృతితో ఆందోళనలు ఉద్ధృతం

ABOUT THE AUTHOR

...view details