తెలంగాణ

telangana

By

Published : Mar 4, 2020, 3:24 PM IST

ETV Bharat / international

ఒప్పందానికి తూట్లు- తాలిబన్ల దాడిలో 20మంది మృతి

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు మరోసారి బరి తెగించారు. దాడి చేసి 20 మంది అఫ్గాన్​ భద్రతా సిబ్బందిని బలిగొన్నారు. వెంటనే తాలిబన్ల స్థావరాలపై అమెరికా సైన్యం వైమానిక దాడి చేసింది. అమెరికాతో శాంతి ఒప్పందం చేసుకున్న కొద్ది రోజులకే ఈ దాడులు చేయడం వల్ల భవిష్యత్​లో జరిగే చర్చలు ప్రశ్నార్థకమయ్యాయి.

taliban
అమెరికా-తాలిబన్ల మధ్య దాడులు

అఫ్గానిస్థాన్​ సైనికులు, పోలీసులపై తాలిబన్లు విరుచుకుపడ్డారు. తాలిబన్లు జరిపిన దాడిలో 20 మంది అఫ్గాన్​ భద్రతా సిబ్బంది మృతి చెందారు. అఫ్గానిస్థాన్​లో శాంతి నెలకొల్పడంపై తాలిబన్ నాయకుడు ముల్లాతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ మాట్లాడిన కొద్ది గంటలకే ఈ దాడికి ఒడిగట్టారు తాలిబన్లు. ఈ నేపథ్యంలో అమెరికా సైన్యం సైతం తాలిబన్ల దాడికి దీటుగా సమాధానమిచ్చింది. వారి స్థావరాలపై వైమానిక దాడి చేసింది. అమెరికా సైన్యం అధికార ప్రతినిధి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

అఫ్గానిస్థాన్​లో శాంతి నెలకొల్పేందుకు అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్న కొద్ది రోజులకే ఈ దాడులకు దిగారు తాలిబన్లు. ఈ నేపథ్యంలో తర్వాత జరిగే చర్చలు ప్రశ్నార్థకంగా మారాయి. ఒప్పందంలో భాగంగా అఫ్గాన్​ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య ఖైదీల అప్పగింతలో తలెత్తిన అభిప్రాయభేదాలే దాడులకు కారణంగా తెలుస్తోంది.

"నహ్రా-ఏ-సరాజ్, హెల్మండ్​లోని తాలిబన్ల స్థావరాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇది ఆత్మరక్షణ కోసం చేసిన దాడి మాత్రమే."

-సన్నీ లెగెట్, అమెరికా అఫ్గానిస్థాన్ సైనిక వ్యవహారాల బాధ్యుడు

అమెరికా-తాలిబన్ల మధ్య ఇటీవల పాక్షిక ఒప్పందం కుదిరింది. పూర్తిస్థాయి ఒప్పందాలపై సంతకాలు చేసే దిశగా ఇరువర్గాలు సాగుతున్నాయి. మార్చి 10 నుంచి అఫ్గాన్​- తాలిబన్ల మధ్య పూర్తిస్థాయి ఒప్పందం కోసం చర్చలు ప్రారంభం కావాల్సి ఉంది. గత 11 రోజులుగా అఫ్గాన్​లో ఎలాంటి దాడులు చోటుచేసుకోలేదు. ఇప్పుడిప్పుడే శాంతి నెలకొంటున్న అఫ్గాన్​లో ఈ దాడులు మరోసారి ఉద్రిక్తతలను పెంచాయి.

ఇదీ చూడండి:తాలిబన్​ నాయకుడితో ట్రంప్ సంభాషణ ​

ABOUT THE AUTHOR

...view details