అమెరికా క్యాపిటల్ భవనం వద్ద బుధవారం చెలరేగిన హింసాత్మక ఘటనలపై చర్యలు చేపట్టారు ఫెడరల్ అధికారులు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులపై దేశ ద్రోహం కేసుతో పాటు అన్ని రకాల అభియోగాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు కొలంబియా ఫెడరల్ ఉన్నతాధికారి.
" అక్రమ చొరబాటు, ఆస్తుల ధ్వంసం, వంటి అభియోగాల కింది 15 కేసులు మోపాలని అధికారులు భావిస్తున్నారు. మరిన్ని చర్యలు చేపట్టేందుకు కావాల్సిన సాక్ష్యాధారాల సేకరణలో నిమగ్నమయ్యారు. నిరసనకారులపై తీసుకోవాల్సిన చర్యల అంశం పరిశీలనలో ఉంది. సాధ్యమైనంత మేరకు ఎక్కువ కేసులు పెట్టేందుకే చూస్తున్నాం. ఇప్పటి వరకు వాషింగ్టన్లో 90 మందికిపైగా అరెస్ట్ కాగా.. మరింత మందిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. శాంతియుత అధికార బదిలీని అడ్డుకునే లక్ష్యంతో దాడికి పాల్పడింది ఎవరైనా చర్యలు తీసుకుంటామని దేశవ్యాప్తంగా ఉన్న అటార్నీలు చెబుతున్నారు. "
- మిచెల్ షెర్విన్, డీసీ అటార్నీ జనరల్