తెలంగాణ

telangana

By

Published : Jun 14, 2020, 6:58 AM IST

ETV Bharat / international

భగవద్గీతతో ప్రశాంతత: గబార్డ్‌

భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన భక్తి, కర్మయోగాలను అనుసరించడం ద్వారా మానసిక ప్రశాంతత, మనోబలాన్ని పొందవచ్చని తులసీ గబార్డ్ పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్​కు ఎన్నికైన తొలి హిందూ మతస్థురాలైన గబార్డ్.. ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితుల్లో భగవద్గీత పారాయణ ద్వారా విజయవంతమైన జీవనాన్ని గడపగలుగుతారని ఆమె స్పష్టం చేశారు.

Find strength & peace in Bhagavad Gita: Tulsi Gabbard to students
భగవద్గీతతో ప్రశాంతత: గబార్డ్‌

ప్రస్తుతం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, ఈ నేపథ్యంలో భగవద్గీతతో ప్రశాంతతను పొందొచ్చని అమెరికా కాంగ్రెస్‌కు ఎన్నికైన తొలి హిందూ మతస్థురాలు తులసీ గబార్డ్‌ పేర్కొన్నారు. "రేపు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన భక్తియోగం, కర్మయోగాన్ని అనుసరించడం ద్వారా ప్రశాంతత, మనోబలాన్ని పొందొచ్చు" అని హిందూ విద్యార్థులను ఉద్దేశించి చేసిన వర్చువల్‌ ప్రసంగంలో పేర్కొన్నారు. హిందూ విద్యార్థుల మండలి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.

"జీవితంలో మీరు కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్న తరుణంలో జీవిత పరమార్థమేమిటని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. భగవంతుడిని, భగవంతుడి సంతానాన్ని సేవించడం, కర్మయోగాన్ని అనుసరించడమే జీవిత పరమార్థమని మీరు గుర్తించగలిగితే విజయవంతమైన జీవనాన్ని మీరు గడుపుతారు." అని ఆమె చెప్పారు.

ఇదీ చూడండి:అమెరికాలో సిక్కు యువతి సరికొత్త చరిత్ర

ABOUT THE AUTHOR

...view details