గత ఏడాది అంఫన్ తుపాను భారత్ను ఆర్థికంగా గట్టి దెబ్బకొట్టిందని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. ఏకంగా రూ.1.05 లక్షల కోట్ల ఆర్థిక నష్టాన్ని కలిగించిందని తెలిపింది.
ఓ వైపు కొవిడ్-19 విజృంభణ, మరోవైపు ప్రతికూల వాతావరణ పరిస్థితులతో 2020లో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొంది. '2020లో అంతర్జాతీయ పర్యావరణ పరిస్థితి' పేరుతో ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) రూపొందించిన నివేదికను ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ సోమవారం విడుదల చేశారు.