ఎన్నికల హామీలో పేర్కొన్న విధంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ జాతివివక్ష నిర్మూలనకు చర్యలు చేపట్టారు. వ్యవస్థాగత వివక్షను నిర్మూలించి, దేశవ్యాప్తంగా సమానత్వం ఉండేలా నాలుగు కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆసియా అమెరికన్లు, పసిఫిక్ దీవులకు చెందిన వారిపైన జాత్యహంకారులు వివక్ష చూపకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వారితో మరింత సన్నిహితంగా మెలగాలని న్యాయశాఖకు సూచించారు. కొవిడ్పై పోరులో వివక్షకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని ఆరోగ్య, మానవహక్కుల శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ట్రంప్ ఏర్పాటు చేసిన 'కౌంటర్ ఫాక్చువల్ 1776 కమిషన్'ను బైడెన్ రద్దు చేశారు.
"జార్జి ఫ్లాయిడ్ మరణంతో న్యాయ వ్యవస్థ గొంతు నులిమినట్టు అయింది. నేను అతని కుమార్తెను కలిసినప్పుడు.. మా నాన్న ప్రపంచాన్ని మార్చాడు అని ఆ చిన్నారి చెప్పింది. ఆమె చెప్పింది నిజం. ఆ ఘటన మార్పునకు కారణమైంది. అందరూ సమానం అని పేర్కొనే మన దేశ మూల సూత్రాలను ఏనాడూ అనుసరించలేదు. అవి పాటించాల్సిన సమయం వచ్చింది."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
ప్రైవేటు జైళ్లు రద్దు..