ఇద్దరు భారత సంతతి అమెరికన్లకు కీలక బాధ్యతలు అప్పగించారు అధ్యక్షుడు జో బైడెన్. ఐరాసలో అమెరికా మిషన్కు చెందిన నాయకత్వ బృందానికి సలహాదారులుగా సోహిని ఛటర్జీ, అదితీ గొరూర్ను నియమించారు.
మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా బృందంలో ప్రపంచ అభివృద్ధి అంశాలపై పనిచేసిన ఛటర్జీ... ఐరాసలోని అమెరికా మిషన్ బృందంలో సీనియర్ సలహాదారుగా పనిచేయనున్నారు. గతంలో ఐరాసలో శాంతిభద్రతల విభాగంలో పనిచేసిన గొరూర్ కూడా సలహాదారుగా వ్యవహరించనున్నారు.
ఇటీవలే బైడెన్... యూఎన్లో అమెరికా శాశ్వత ప్రతినిధిగా లిండా థామస్-గ్రీన్ ఫీల్డ్ను ప్రకటించారు. సెనేట్ సభ్యులు అనుమతించాక ఈమె శాశ్వత సభ్యురాలు కానున్నారు.