తెలంగాణ

telangana

ETV Bharat / international

సైనిక కాన్వాయ్​పై ఉగ్రదాడి- 14మంది మృతి - ఆఫ్రికాదేశంపై ఉగ్రదాడి

ఆఫ్రికా దేశాల్లో ఉగ్రహింస పెరిగిపోతోంది. బుర్కినా ఫాసోలో ముష్కరులు జరిపిన మెరుపుదాడుల్లో ఆ దేశానికి చెందిన 14 మంది సైనికులు మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. ఈ నెల 22న అక్కడ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ఈ తరహా ఘటనలు జరగడం అధికారుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

14 Burkina Faso soldiers killed by extremists in Sahel area
ఆఫ్రికాదేశంపై ఉగ్రదాడి- 14మంది సైనికులు మృతి

By

Published : Nov 13, 2020, 8:25 PM IST

ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో ఉగ్రవాదులు చేసిన మెరుపుదాడుల్లో.. 14 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సహేల్​ ప్రాంతంలో మిలటరీ కాన్వాయ్​పై జరిగిన ఈ దాడిలో మరో ముగ్గురు గాయపడ్డారని ప్రభుత్వం తెలిపింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. అయితే.. ఈ దాడికి కారణమైన వారికోసం సాయుధ బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయని అక్కడి అధికార ప్రతినిధి చెప్పారు.

వారం రోజుల్లోనే రెండోది..

అంతకముందే ఔదాలన్​ సమీప నగరమైన గోరోమ్​లో సుమారు 20మంది ముష్కరులు మోటార్​బైకులతో దాడిచేసి ఓ బార్​కు నిప్పంటించారట. అనంతరం అక్కడి వారిని భయపెట్టినట్టు తెలుస్తోంది. తాజా ఘటనతో బుర్కినా ఫాసోలో వారం రోజుల వ్యవధిలోనే ఇది రెండో దాడి.

ఈ నెల 22న ఆ దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ తరహా ఘటనలు జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ పరిస్థితుల్లో భద్రత మరింత కట్టుదిట్టం చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.

అల్​ ఖైదా, ఇస్లామిక్​ దేశాలతో ముడిపడి ఉన్న తీవ్రవాద హింస.. పశ్చిమాఫ్రికా అంతటా వ్యాపించింది. ఈ హింసల కారణంగా ఈ ఏడాది సుమారు 2వేల మందికిపైగా మృతిచెందారు.

ఇదీ చదవండి:ఘానాలో చర్చి కూలి 22 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details