బుర్కినా ఫాసో దేశంలో భయంకరమైన దాడి జరిగింది. గుర్తుతెలియని సాయుధులు.. ఓ కెనడియన్ మైనింగ్ కంపెనీ సెమాఫో ఉద్యోగులే లక్ష్యంగా విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
సిబ్బంది ప్రయాణిస్తున్న ఐదు బస్సులపై దాడి చేసి దారుణానికి ఒడిగట్టారు. ఇందులో సాధారణ సిబ్బంది, కాంట్రాక్టర్లు, సరఫరాదారులు ఉన్నట్లు తూర్పు ప్రాంత గవర్నర్ సైడౌ సనోవ్ వెల్లడించారు. బస్సులపై పేలుడు పదార్థాలు విసిరినట్లు.. మరికొందరిపై కాల్పులు జరిపినట్లు పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఇదే అత్యంత భయంకరమైన దాడిగా అభివర్ణించారు.
జిహాదీ తిరుగుబాటుదారులే...