తెలంగాణ

telangana

By

Published : May 18, 2022, 2:16 PM IST

Updated : May 18, 2022, 2:50 PM IST

ETV Bharat / crime

స్నేహితుడిని కత్తితో పొడిచి రక్తం కారుతుండగానే సెల్ఫీ

తన గర్ల్‌ఫ్రెండ్‌కి హాయ్ చెప్పాడనే అక్కసుతో పదో తరగతి విద్యార్థి తన స్నేహితుడితో కలిసి మరో విద్యార్థిపై విచక్షణారహితంగా కత్తులతో దాడి చేసిన.. వ్యవహారంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. అతడిని మరో బాలుడు కత్తితో పొడిచి.. రక్తం కారుతుండగానే సెల్ఫీ దిగినట్లు పోలీసులు తెలిపారు.

విద్యార్థిపై కత్తులతో దాడి
విద్యార్థిపై కత్తులతో దాడి

ప్రేమ వ్యవహారం ఇద్దరు బాలుర మధ్య చిచ్చురేపిన ఘటనలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుడు దుర్గాప్రసాద్​పై మరో బాలుడు కత్తితో పొడిచి.. రక్తం కారుతుండగానే సెల్ఫీ దిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాజేంద్రనగర్‌ పీఎస్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. అనంతరం బంజారాహిల్స్‌ పీఎస్‌కు బదిలీ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

అసలేెం జరిగిదంటే

తన ప్రియురాలికి దుర్గాప్రసాద్‌ హాయ్‌ చెప్పాడనే అక్కసుతో నిందితులు దాడి చేశారు. దుర్గాప్రసాద్‌తో కలిసి ఫిలింనగర్‌లో పార్టీ చేసుకున్న ఇద్దరు స్నేహితులు మాయమాటలు చెప్పి అతణ్ని అత్తాపూర్‌లోని మూసీ వద్దకు తీసుకెళ్లారు.. అక్కడ ఒక్కసారిగా కత్తులతో దాడి చేయడంతో ప్రసాద్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. బాధితుడు అరుపులు కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు.

ఇదీ చదవండి:గర్ల్‌ఫ్రెండ్‌కి హాయ్ చెప్పాడని.. విద్యార్థిపై కత్తులతో దాడి

పెను విషాదం.. గోడ కూలి 12 మంది దుర్మరణం

Last Updated : May 18, 2022, 2:50 PM IST

ABOUT THE AUTHOR

...view details