తెలంగాణ

telangana

By

Published : Apr 12, 2021, 1:56 PM IST

ETV Bharat / crime

ఆడుకునేందుకు బయటకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యం

ఆడుకోవడానికి బయటకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైన ఘటన మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల పరిధిలో చోటుచేసుకుంది. మిస్సింగ్​ కేసుగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

girl missing in jeedimetla
జీడిమెట్లలో విద్యార్థిని అదృశ్యం

మేడ్చల్​ జిల్లా జీడిమెట్ల పరిధిలో విద్యార్థిని అదృశ్యం కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం.. ఆడుకోవడానికి బయటకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైంది. రాజీవ్ గాంధీ నగర్​కు చెందిన రీటా కుమారి (14) నిన్న సాయంత్రం బయటకు వెళ్లింది. సాయంత్రం వరకు తిరిగిరాకపోవడంతో తన సోదరుడు తల్లిదండ్రులకు తెలియజేశాడు.

చుట్టుపక్కల ఎంత వెతికినా బాలిక ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి:చోరీకి వచ్చి భవనంపై నుంచి దూకాడు.. చనిపోయాడు

ABOUT THE AUTHOR

...view details