తెలంగాణ

telangana

ETV Bharat / crime

Ganja Seized: 566 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్​ - 566 kilos Ganja Seized

566-kg-of-cannabis-seized-and-two-arrested-in-sattupally
566-kg-of-cannabis-seized-and-two-arrested-in-sattupally

By

Published : Nov 11, 2021, 3:53 PM IST

Updated : Nov 11, 2021, 5:20 PM IST

15:51 November 11

566 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్​

ఖమ్మం సత్తుపల్లిలో భారీగా పొడి గంజాయి(Ganja Seized in sattupally) పట్టుబడింది. ఏపీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు లారీలో అక్రమంగా తరలిస్తున్న కోటీ నలభై రెండు లక్షల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్​లోని మారేడుమిల్లి నుంచి మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​కు లారీ ట్రాలీ అడుగు భాగంలో ప్రత్యేకించి తయారు చేసిన బాక్స్​లో 566 కిలోల గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితులు భాగస్వామై ఉండగా.. ఇందులో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంకో నిందితుడు పరారయ్యాడని పోలీసులు తెలిపారు. తప్పించుకున్న వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలియజేశారు.

జిల్లాలో రెండు నెలలుగా గంజాయిని పట్టుకునేందుకు స్పెషల్ డ్రైవ్​తో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గంజాయిని తరలిస్తున్న వాహనాలను పట్టుకోవడంలో ఫలితాలు సాధిస్తున్నామని ఎస్పీ విష్ణు వారియర్​ తెలిపారు. సమాజాన్ని చెడగొట్టే వాళ్ళను ఎట్టి పరిస్థితులలో చట్టం ముందుకు తీసుకురావడంలో పోలీసులు ముందున్నారని తెలియజేశారు. ఈ కేసులో మహారాష్ట్రకు చెందిన యోగేశ్ లింబాజీ, ఇర్ఫాన్ సదర్ అరెస్ట్​ కాగా.. గణేష్ ఉబాలే పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలియజేశారు.

ఇదీ చూడండి:

Last Updated : Nov 11, 2021, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details