తెలంగాణ

telangana

By

Published : Jul 3, 2021, 3:00 PM IST

ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 3PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 3PM

నగరంలో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్

నెలరోజుల్లో.. హైదరాబాద్​లో వ్యాక్సినేషన్ సెంటర్ ఏర్పాటు కానుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి(KISHAN REDDY) ప్రకటించారు. పీఎం కేర్స్ నిధులతో వ్యాక్సిన్ టెస్టింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

' ఎన్నికలెప్పుడొచ్చినా ​ సిద్ధమే'

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. పార్టీలో అందరిని కలుపుకుని ముందుకు పోయేందుకే సీనియర్లను కలుస్తూ వారి సలహాలు, సూచనలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ నెల ఏడో తేదీన తాను పీసీసీ పదవీ బాధ్యతలు చేపట్టేలోపు అందరిని ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

వారిని ఆదుకుంటాం

క్షీరసాగర్​లో నిర్వహించిన పల్లెప్రగతిలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. గ్రామంలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే వాటిని పరిష్కరించాలని అధికారులను సూచించారు. హరితహారంలో భాగంగా ఆయిల్​ పామ్ సాగు మొక్కలను నాటారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

నేతన్న కళాఖండం.!

ప్రతి మనిషిలో కచ్చితంగా ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. వాటిలో చేనేత కార్మికులది ప్రత్యేక శైలి. అగ్గిపెట్టెలో పట్టుచీరని పట్టించడమే గాక, వినూత్న ప్రయత్నాలతో అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. చిన్న మగ్గంపై చీరలు నేయడమే కాకుండా ప్రముఖుల చిత్రాలను సైతం వేస్తున్నారు సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు. తాజాగా సీఎం కేసీఆర్, కేటీఆర్​ చిత్రాలను వేసి శెభాష్​ అనిపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

చంపేసి నమ్మించాడు

హైదరాబాద్ వనస్థలిపురంలో భార్యను హత్య చేసి కరోనాతో మృతి చెందినట్లు నమ్మించిన భర్తను అరెస్ట్ చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. భార్య అందంగా ఉంటుంది... వేరే వారితో మాట్లాడుతుందనే అనుమానంతోనే విజయ్ ఈ హత్య చేసినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రఫేల్‌ ఒప్పందంపై దర్యాప్తు!

రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై ఫ్రాన్స్‌లో దర్యాప్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ న్యాయమూర్తిని కూడా నియమించినట్లు అక్కడి ప్రముఖ మీడియా సంస్థ 'మీడియాపార్ట్‌' పేర్కొంది. భారత్‌- ఫ్రాన్స్‌ ప్రభుత్వాల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి ఒప్పందం కావడంతో ఈ అంశానికి ఇరు దేశాల్లో ప్రాధాన్యం ఏర్పడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఉత్తరాఖండ్ సీఎం ఆయనే.!

ఉత్తరాఖండ్​ ముఖ్యమంత్రిగా సిట్టింగ్​ ఎమ్మెల్యేనే ఉంటారని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు మదన్​ వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు శాసనసభాపక్ష సమావేశం జరుగుతుందని, అందులో సీఎంను ఎన్నుకుంటామని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సేవలకు అంతరాయం

జులై​ 4వ తేదిన ఎస్​బీఐ(SBI) సేవలకు అంతరాయం కలగనుంది. సుమారు రెండు గంటల మేర సేవలు నిలిచిపోయనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ క్రికెటర్లకు తీపికబురు.!

దేశవాళీ క్రికెటర్ల మ్యాచ్​ ఫీజులు పెంచుతూ బీసీసీఐ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఆటగాళ్లకు చెల్లించే ఫీజుల్లో భారీ మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీతో పాటు కార్యదర్శి జై షా ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అందులో నిజమెంత?

'బాహుబలి' రచయిత విజయేంద్ర ప్రసాద్​.. పవన్ కల్యాణ్(pawan Kalyan)​ కోసం ఓ కథ సిద్ధం చేశారని వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించారీ స్టార్ రైటర్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details