తెలంగాణ

telangana

By

Published : Jul 28, 2021, 4:39 PM IST

ETV Bharat / city

PG Entrance: సీపీజీఈటీ- 2021 నోటిఫికేషన్​.. జులై 30 నుంచి దరఖాస్తు

రాష్ట్రంలోని యూనివర్సిటీల పరిధిలో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే సీపీజీఈటీ-2021 ప్రకటన విడుదలైంది. జులై 30 నుంచి ఆన్​లైన్​ అప్లికేషన్లు ప్రారంభమవగా... సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రవేశ పరీక్షలు జరనున్నట్లు అధికారులు వెల్లడించారు.

telangana Cpget Notification Released
telangana Cpget Notification Released

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిధిలో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష 'సీపీజీఈటీ-2021' నోటిఫికేషన్ విడుదలైంది. 30 జులై నుంచి ఆన్​లైన్​ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తులకు 25 ఆగస్టు చివరి తేదీగా నిర్ణయించారు.

రూ. 500 ఆలస్య రుసుముతో 30 ఆగస్టు వరకు, రూ. 2000 ఆలస్య రుసుంతో 03 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రవేశ పరీక్షలు జరగనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పాండు రంగారెడ్డి ప్రకటించారు.

ఇదీ చూడండి:

polycet 2021: పాలిసెట్‌ 2021 ఫలితాలు విడుదల

ABOUT THE AUTHOR

...view details