లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఎక్కడికక్కడ చెక్పోస్టులు పెట్టి వాహనాలు బయటకు రాకుండా నియంత్రిస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సీపీ సజ్జనార్ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. హైటెక్ సిటీ పరిసరాల్లో బయటకి వచ్చిన వాహనదారులపై కేసులు నమోదు చేశారు. జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం కాబట్టి ప్రజలు అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. నిత్యావసర వస్తు దుకాణాలు కూడా రాత్రి 7 గంటలకు మూసివేయాలని ఆదేశించారు. కమిషనరేట్ పరిధిలో 9 చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్టు వివరించారు.
బాహ్యవలయ రహదారి మూసివేత!
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు కలెక్టర్ అమయ్ కుమార్ వెల్లడించారు. అత్యవసర హెల్ఫ్ లైన్, సందేహాల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నగర శివారుల్లో ఉన్న వాహనాలను పంపించిన తర్వాత అధికారుతో సంప్రదించి బాహ్యవలయ రహదారిని కూడా మూసివేస్తామని ట్రాఫిక్ డీసీపీ తెలిపారు.