తెలంగాణ

telangana

ETV Bharat / city

వరదలతో ప్రజల అవస్థలు.. సాయం కోసం ఎదురుచూపులు - వరదలతో యానాం ప్రజల అవస్థలు

Floods in yanam: మహోగ్ర గోదావరి.. మూడు దశాబ్దాల తర్వాత లంక గ్రామాల ప్రజలను బిక్కుబిక్కుమనేలా చేస్తోంది. ప్రతి ఏడాది వరదలానే భావించి అక్కడే ఉండిపోయిన యానాం ప్రజలు.. ప్రస్తుత గోదావరి ఉద్ధృతికి తేరుకుని బయటికి రాలేక సర్వం కోల్పోయారు. పలు కాలనీల్లో నడుము లోతు నీరు చేరింది. గూడు చెదిరిన వారంతా గుడారాల్లోనూ.. కింది అంతస్తు మునిగిన వారంతా.. డాబాల మీదకు చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.

వరదలతో ప్రజల అవస్థలు.. సాయం కోసం ఎదురుచూపులు
వరదలతో ప్రజల అవస్థలు.. సాయం కోసం ఎదురుచూపులు

By

Published : Jul 17, 2022, 12:55 PM IST

Floods in yanam: ఆంధ్రప్రదేశ్​లోని తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 25 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి వదలడంతో గౌతమి గోదావరి నది ఉగ్రరూపంలో ప్రవహిస్తుంది. గోదావరి నది పరివాహక ప్రాంతమైన కాకినాడ జిల్లాలో.. అంతర్భాగంగా ఉన్న కేంద్ర పాలిత యానాం మునుపెన్నడూ లేని విధంగా ముంపు బారినపడింది. భారీ వరదల కారణంగా గోదావరికి చేరువలో ఉన్న 8 గ్రామాలు పూర్తిగా ముంపునకు గురయ్యాయి. పలు కాలనీల్లో నడుము లోతు నీరు చేరింది.

గూడు చెదిరిన వారంతా గుడారాల్లోనూ.. కింది అంతస్తు మునిగిన వారంతా.. డాబాల మీదకు చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇల్లు వదిలి బయటకు వస్తే విలువైన సామాగ్రి దొంగల పాలవుతుందని.. ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లటం లేదు.

వరద ముంపు బారిన పడిన సుమారు 1,500 కుటుంబాలకు పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఆర్ధిక సహకారంతో.. యానం ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఉదయం భోజనం అందిస్తున్నారు. వరద ప్రభావం మరో మూడు రోజుల పాటు కొనసాగే పరిస్థితి ఉండటంతో.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

  • ఇవీ చూడండి:

భద్రాచలంలో గోదారమ్మకు శాంతి పూజలు చేసిన సీఎం కేసీఆర్

ఫోన్​ దొంగను చితకబాదిన యువతి.. వీడియో వైరల్​

ABOUT THE AUTHOR

...view details