1. 'యాదాద్రి ప్రత్యేకత చాటుకోబోతోంది'
యాదాద్రి లక్ష్మీనారసింహుని దివ్యక్షేత్రాన్ని పున:ప్రారంభం కోసం తుదిమెరుగులు దిద్దే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. క్యూలైన్ల నిర్మాణాన్ని వచ్చే నెల 15వతేదీ కల్లా పూర్తి చేయాలని గడువు విధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. 'ఉద్యమ స్ఫూర్తితోనే సాకారం'
స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణను సాకారం చేసుకున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ వేదికగా రాష్ట్రంలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వేడుకలకు సీఎం అంకుర్పారణ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. పోలింగ్కు ఏర్పాట్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అదనపు డీజీ, కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మొబైల్ నెట్వర్క్ మోసం
మొబైల్ నెట్వర్క్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. అతను ఇతర నెట్వర్క్ సంస్థల పేరిట మీ ప్లాన్ గడువు ముగుస్తుందని ఫోన్ చేస్తాడు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. ఉత్తరాఖండ్ సీఎం కేబినెట్
ముఖ్యమంత్రి పదవి చేపట్టాక తొలిసారి కేబినెట్ విస్తరణ చేపట్టారు ఉత్తరాఖండ్ సీఎం తీరథ్ సింగ్ రావత్. గవర్నర్ సమక్షంలో నూతన మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.