1. నేతలతో కేటీఆర్ భేటీ... ఎమ్మెల్సీ వ్యూహంపై చర్చ
తెలంగాణ భవన్లో గ్రేటర్ హైదరాబాద్ నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. సమావేశానికి మంత్రులు తలసాని శ్రీనివాస్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. సవాల్: ఒక్క ఉద్యోగం ఎక్కువిచ్చినా రాజీనామా చేస్తాం
భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలిస్తే మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ భాజపా నేతలు సవాల్ విసిరారు. భాజపా పాలిత రాష్ట్రాల్లో తెలంగాణలో తరహా అభివృద్ధి లేదని వారు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. 'కేటీఆర్ సహాయం మర్చిపోలేం'
తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ కొల్లూరి చిరంజీవి వైద్య ఖర్చుల నిమిత్తం మంత్రి కేటీఆర్ చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేమని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు మంత్రికి కృతజ్ఞతలు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. మేడారంలో కరోనా పాజిటివ్
మేడారం చినజాతరలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు దేవాదాయశాఖ ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు జిల్లా వైద్యాధికారి అప్పయ్య పేర్కొన్నారు. మేడారంలో భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతోంది. మేడారం చినజాతర నేటితో ముగియనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. 'కేసులు పెరుగుతున్నాయ్'
రాష్ట్రాలు కొవిడ్ నిబంధనలను మరింత కఠినతరం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశ వ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకొని ఆయా రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించింది. మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలను చేపట్టాలని కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.