తెలంగాణ

telangana

By

Published : Mar 1, 2021, 12:16 PM IST

ETV Bharat / city

మద్యం మత్తులో వీరంగం.. ఇళ్లపై రాళ్లు రువ్వుతూ దాడి

ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం వద్ద.. మద్యం మత్తులో కొందరు వ్యక్తులు సమీపంలోని ఇళ్లపై రాళ్లు రువ్వారు.

మద్యం మత్తులో వీరంగం.. ఇళ్లపై రాళ్లు రువ్వుతూ దాడి
మద్యం మత్తులో వీరంగం.. ఇళ్లపై రాళ్లు రువ్వుతూ దాడి

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండల కేంద్రంలోని శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం సమీపంలో కొందరు వీరంగం సృష్టించారు. మద్యం సేవించి ఇళ్లపై రాళ్లు, సీసాలు విసిరారు. ప్రశ్నించిన స్థానికులపై దాడికి దిగారు. ఈ ఘటనతో పలువురు భక్తులు భయాందోళనకు గురయ్యారు.

మద్యం మత్తులో వీరంగం.. ఇళ్లపై రాళ్లు రువ్వుతూ దాడి

టెక్కలి నుంచి వచ్చిన కొందరు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం సమీపంలోని తోటలో మద్యం సేవించారు. మత్తులో స్థానిక ఇళ్లపై దాడి చేశారు. ఈ ఘటనలో శ్రీనివాస్ అనే వ్యక్తి కుటుంబీకులకు గాయాలయ్యాయి. పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అమీర్ అలీ తెలిపారు.

ఇదీ చూడండి:అట్టహాసంగా లింగమంతుల జాతర ప్రారంభం.. బారులుతీరిన భక్తులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details