తెలంగాణ

telangana

By

Published : Sep 22, 2019, 12:38 PM IST

ETV Bharat / city

వాళ్లను చేర్చుకోలేదు... విలీనం చేసుకున్నాం: సీఎం కేసీఆర్

తెరాసలో సీఎల్పీ విలీనం రాజ్యాంగబద్ధంగానే జరిగిందన్నారు సీఎం కేసీఆర్. ఉద్యమ సమయంలో తెరాస ఎమ్మెల్యేలను చేర్చుకుని... ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించారని గుర్తు చేశారు.

cm kcr

తెరాసలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల విలీనం రాజ్యాంగ బద్ధంగా జరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోలేదని.. విలీనం చేసుకున్నామని స్పష్టం చేశారు. నైతికత గురించి కాంగ్రెస్‌ తమకు నీతులు చెప్పే అవసరం లేదని అన్నారు. విలీనం అయితే సాంకేతిక సమస్య ఉత్పన్నం కాదని ఎమ్మెల్యేలకు చెప్పినట్లు పేర్కొన్నారు.

వాళ్లను చేర్చుకోలేదు... విలీనం చేసుకున్నాం: సీఎం కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details