తెలంగాణ

telangana

ETV Bharat / city

chandrababu: 'విశాఖ క్రైం క్యాపిటల్​గా మారిపోయింది' - విద్యుత్ ఉద్యోగి హత్యపై చంద్రబాబు కామెంట్స్

ఏపీలోని విశాఖ జిల్లా విద్యుత్ ఉద్యోగి హత్యపై తెదేపా అధినేత చంద్రబాబు ఏపీ డీజీపీ సవాంగ్​కు లేఖ రాశారు. లైన్‌మెన్‌ బంగార్రాజు దారుణ హత్యకు గురై 5 రోజులు గడుస్తున్నా.. ఇప్పటికీ పోస్టుమార్టం నిర్వహించలేదన్నారు. హత్యలో అధికార వైకాపాకి చెందిన అగ్రనేతల ప్రమేయం ఉందనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోందని చంద్రబాబు ఆరోపించారు.

CHANDRABABU
CHANDRABABU

By

Published : Nov 7, 2021, 12:38 AM IST

ప్రశాంతతకు మారుపేరైన విశాఖ.. నేడు భూకబ్జాలు, హత్యలతో క్రైమ్ క్యాపిటల్‌గా మారిపోయిందని తెదేపా అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. విశాఖలో హత్యకు గురైన.. విద్యుత్ లైన్​మెన్ బంగార్రాజు మృతిపై డీజీపీ గౌతం సవాంగ్​కు ఆయన లేఖ రాశారు. ఏనుగులపాలెంలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు లక్ష్మణరావు అతిథి గృహం పక్కనే బంగార్రాజు మృతదేహం లభ్యమైందని.. ఇప్పటికి 5 రోజులైనా పోస్ట్‌మార్టం నిర్వహించకపోవటం విచారకరమన్నారు.

హత్యలో అధికార వైకాపాకి చెందిన అగ్ర నేతల ప్రమేయం ఉండడంతో పోలీసులు ఈ కేసులో ముందుకు వెళ్లేందుకు వెనుకంజ వేస్తున్నారనే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోందని చంద్రబాబు ఆరోపించారు. సమగ్ర విచారణ చేపట్టి నిందితులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీకి రాసిన లేఖలో చంద్రబాబు కోరారు.

ఏపీ డీజీపీకి చంద్రబాబు రాసిన లేఖ

ఇదీచూడండి:Beggar Murder: వైట్‌నర్‌ మత్తులో కత్తితో పొడిచి దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details