తెలంగాణ

telangana

ETV Bharat / business

ద్రవ్యోల్బణం చిక్కులతో ఒడుదొడుకుల్లో మార్కెట్లు - business news updates

స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 42 పాయింట్లు కోల్పోయి 40వేల 73కు పడిపోయింది. నిఫ్టీ 26 పాయింట్లు క్షీణించి 11వేల 813 వద్ద ట్రేడ్ అవుతోంది.

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

By

Published : Nov 14, 2019, 10:35 AM IST

దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. బొంబాయి స్టాక్​ ఎక్సేంజ్​ సూచీ 42 పాయింట్ల నష్టంతో 40వేల 73కి తగ్గింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్​ నిఫ్టీ 26 పాయింట్లు కోల్పోయి 11వేల 813 వద్ద ట్రేడ్ అవుతోంది.

స్థూల ఆర్థిక గణాంకాలు నిరాశపరచడం, అంతర్జాతీయంగా ప్రతికూలతలు వంటి కారణాలు మదుపర్ల సెంటిమెంట్​పై ప్రభావం చూపుతున్నాయి.

ఎస్​ బ్యాంక్​, ఇన్ఫోసిస్​, ఏషియన్ పెయింట్స్​, మారుతీ షేర్లు 2 శాతానికి పైగా మెరుగుపడ్డాయి.

భారతీ ఎయిర్​టెల్​, ఇండస్ఇండ్, ఎస్​బీఐ, టాటా మోటార్స్​, హెచ్​యూఎల్​ షేర్లు 3 శాతానికిపైగా నష్టపోయాయి.

ABOUT THE AUTHOR

...view details