తెలంగాణ

telangana

By

Published : Oct 5, 2021, 9:31 AM IST

Updated : Oct 5, 2021, 3:45 PM IST

ETV Bharat / business

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు- సెన్సెక్స్​ 446 ప్లస్​

Stock Market live
స్టాక్​ మార్కెట్ లైవ్​

15:40 October 05

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 446 పాయింట్లు బలపడి 59,745 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 131 పాయింట్ల లాభంతో 17,822 వద్దకు చేరింది. 

బ్యాంకింగ్, టెలికాం, ఐటీ షేర్లు లాభాలకు దన్నుగా నిలిచాయి. ఫార్మా, ఎఫ్​ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.

  • ఇండస్​ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్​, హెచ్​సీఎల్​టెక్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​, టైటాన్​ షేర్లు లాభాలను గడించాయి.
  • సన్​ఫార్మా, ఐటీసీ, పవర్​గ్రిడ్​, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి.

14:37 October 05

స్టాక్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్ల లాభంతో 59,700 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 110 పాయింట్లకుపైగా పెరిగి 17,806 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

  • ఇండస్​ఇండ్ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, హెచ్​సీఎల్​టెక్​, టీసీఎస్​, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, ఏషియన్​ పెయింట్స్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • సన్​ ఫార్మా, అల్ట్రాటెక్​ సిమెంట్​, ఐటీసీ, డాక్టర్​ రెడ్డీస్​, కోటక్ మహీంద్రా బ్యాంక్​, నెస్లే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:22 October 05

STOCK MARKET LIVE UPDATES

స్టాక్ మార్కెట్లు (Stocks today) మంగళవారం ఒడుదొడుకుల్లో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్​ (Sensex today) 50 పాయింట్లకుపైగా నష్టంతో 59,243 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 10 పాయింట్లకుపైగా తగ్గి 17,680 వద్ద కొనసాగుతోంది.

ఫినాన్స్​, ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి.

  • మారుతీ సుజుకీ, భారతీ ఎయిర్​టెల్​, ఏషియన్​ పెయింట్స్​, హెచ్​యూఎల్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
  • బజాజ్ ఫిన్​సర్వ్​, హెచ్​సీఎల్​టెక్, టెక్ మహీంద్రా, డాక్టర్​ రెడ్డీస్​, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి.
Last Updated : Oct 5, 2021, 3:45 PM IST

ABOUT THE AUTHOR

...view details