తెలంగాణ

telangana

ETV Bharat / business

సెషన్ పొడగింపుతో మార్కెట్ల జోరు- సెన్సెక్స్ 1030 ప్లస్​ - నిప్టీ

Shar market news live
స్టాక్ మార్కెట్లు లైవ్​

By

Published : Feb 24, 2021, 9:38 AM IST

Updated : Feb 24, 2021, 5:28 PM IST

17:09 February 24

15 వేలకు చేరువైన నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెషన్ పొడిగింపు సూచీల్లో కొత్త ఉత్సాహం నింపింది. సెన్సెక్స్ 1030 పాయింట్లు పెరిగి 50,782 వద్ద ముగిసింది. నిఫ్టీ 274 పాయింట్ల లాభంతో 14,982 వద్ద స్థిరపడింది.

బ్యాంకింగ్ షేర్ల దూకుడు లాభాలకు ప్రధాన కారణం.

  • యాక్సిస్ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, బజాజ్ ఫినాన్స్, ఎస్​బీఐ లాభాలను గడించాయి.
  • డాక్టర్​ రెడ్డీస్, పవర్​గ్రిడ్, టీసీఎస్​, సన్​ఫార్మా, ఏషియన్​ పెయింట్స్, మారుతీ షేర్లు నష్టపోయాయి.

16:20 February 24

సెషన్ పొడగింపు..

స్టాక్ మార్కెట్లు బుధవారం సాయంత్రం 5 గంటల వరకు పని చేయనున్నాయి. ఎన్​ఎస్​ఈలో సాంకేతిక సమస్య తర్వాత ట్రేడింగ్​ను పునరుద్ధరించగా.. సెషన్​ను దాదాపు రెండు గంటలు పొడగించింది. బీఎస్​ఈ కూడా సెషన్​ను పొడగిస్తున్నట్లు ప్రకటించింది.

సెన్సెక్స్ 840 పాయింట్ల లాభంతో 50,596 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 240 పాయింట్లకుపైగా పెరిగి 14,951 వద్ద కొనసాగుతోంది.

  • హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఎస్​బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి.
  • టీసీఎస్​, పవర్​గ్రిడ్, డాక్టర్​ రెడ్డీస్, సన్​ఫార్మా, మారుతీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

09:23 February 24

14,750 పైకి నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా బలపడి.. 49,954 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 70 పాయింట్లకుపైగా లాభంతో 14,778 వద్ద కొనసాగుతోంది.

బ్యాంకింగ్​, హెవీ వెయిట్​ షేర్ల సానుకూలతలు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి. ఐటీ షేర్లు ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నాయి.

  • బజాజ్​ ఫినాన్స్, యాక్సిస్స్ బ్యాంక్, ఎస్​బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.
  • టీసీఎస్​, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్​యూఎల్​, నెస్లే, పవర్​గ్రిడ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
Last Updated : Feb 24, 2021, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details