ఫాన్స్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రెనో మొదటి సారిగా ఎలక్ట్రిక్ ఎస్యూవీని తీసుకురానుంది. మేఘన్ ఈ టెక్ పేరుతో వస్తున్న ఈ ఎస్యూవీ వచ్చే ఏడాది ప్రారంభం నుంచి అందుబాటులోకి రానుంది. దీనికంటే ముందుగా వాహనానికి సంబంధించి వెనుకభాగాన్ని విడుదల చేసింది. అయితే ఈ ఏడాది చివరికి దీని పూర్తి స్థాయి అవుట్లుక్ బయటకు వస్తుందని సంస్థ తెలిపింది. 2025 నాటికి 24 కొత్త మోడళ్లను విడుదల చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం.. వాటిలో మేఘన్ ఈ టెక్ ఒకటని పేర్కొంది.
రెనో విడుదల చేసిన దానిలో కారు పేరుతో పాటు లోగో ఉంది. ఇందులో చివరిగా ఉండే అక్షరం బంగారు రంగులో కనిపిస్తోంది. సైడ్ లైట్లు మొత్తంగా కారునే చుట్టేసేలా ఉన్నాయి. వీటి మధ్యలో లోగోని ఉంచారు.