ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి భారత వృద్ధిరేటు 4.9 శాతంగా ఉంటుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తెలిపింది. గతంలో 5.8 శాతంగా అంచనా వేసిన మూడీస్ ఇప్పుడు 0.9 శాతం మేర కుదించింది.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు చితికి పోవడం, ఉద్యోగాల కల్పన తగ్గడం, ద్రవ్యపరమైన నిబంధనలు తదితరాలు భారత ఆర్థిక వృద్ధిరేటుని ప్రభావితం చేస్తున్నాయని మూడీస్ అభిప్రాయపడింది.