తెలంగాణ

telangana

By

Published : Dec 6, 2019, 2:40 PM IST

ETV Bharat / business

త్వరలో భారత మార్కెట్​లోకి నోకియా 2.3 స్మార్ట్​ఫోన్

హెచ్​ఎమ్​డీ గ్లోబల్​ తన సరికొత్త నోకియా 2.3 స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించింది. భారత్​ మార్కెట్​లోకి త్వరలోనే విడుదల చేస్తామన్న కంపెనీ... ధరపై పూర్తిస్థాయి స్పష్టత ఇవ్వలేదు.

HMD Global launches Nokia 2.3
త్వరలో భారత మార్కెట్​లోకి నోకియా 2.3 స్మార్ట్​ఫోన్

హెచ్​ఎమ్​డీ గ్లోబల్ తన సరికొత్త నోకియా 2.3 స్మార్ట్​ఫోన్​ను ఆవిష్కరించింది. దీని ధరను 109 యూరోలు(సుమారు రూ.8,600)గా నిర్ణయించింది. త్వరలోనే భారత మార్కెట్లో భారీ ఎత్తున విడుదల చేస్తామని ప్రకటించింది. భారత్​లో ధర ఎంత ఉంటుందో మాత్రం వెల్లడించలేదు.

నోకియా 2.3 ఫీచర్స్​

  • 6.2 అంగుళాల స్క్రీన్
  • 2 రోజులపాటు వచ్చే బ్యాటరీ
  • డ్యూయెల్ కెమెరా
  • ఉత్తమ చిత్రం ఎన్నుకునే 'షాట్​' ఫీచర్​
  • ప్రత్యేకమైన గూగుల్ అసిస్టెంట్​ బటన్​

ఈ ఆండ్రాయిడ్​ 10 రెడీ ఫోన్​కు మూడేళ్ల పాటు ప్రతి నెలా సెక్యూరిటీ అప్​డేట్స్ వస్తాయని, రెండేళ్లపాటు ఓఎస్ అప్​డేట్​లు వస్తామని స్పష్టం చేసింది హెఎమ్​డీ గ్లోబల్. కాలక్రమేణా ఈ స్మార్ట్​ఫోన్​ను మరింతగా మెరుగుపరుస్తామని కంపెనీ తెలిపింది.

పూర్వ వైభవం..

భారత్​లో మొబైల్ ఫోన్​లు ప్రవేశించిన తొలి 7-8 సంవత్సరాల్లో నోకియా బ్రాండ్​ ఫోన్లు ఎదురులేని అధిపత్యాన్ని చెలాయించాయి. తరువాత దక్షిణ కొరియా దిగ్గజం శామ్​సంగ్​ ప్రవేశం, తక్కువ ధరకు లభించే చైనా ఫోన్ల రాకతో నోకియా అధిపత్యానికి గండిపడింది.

దూసుకుపోతున్న భారత్​

ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్​ఫోన్​ మార్కెట్లలో భారత్ ఒకటి. ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్​ (ఐడీసీ) ప్రకారం, భారత్​లో స్మార్ట్​ఫోన్​ అమ్మకాలు 2018 జులై-సెప్టెంబర్​తో పోల్చితే 2019లో ఇదే కాలానికి 9.3 శాతం నుంచి 46.6 శాతానికి పెరిగాయి. షియోమీ 27.1 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో... శాంసంగ్​ (18.9 శాతం), వివో (15.2 శాతం), రియల్​మీ (14.3 శాతం), ఒప్పో (11.8 శాతం) ఉన్నాయి.

ఇదీ చూడండి: అలా ఎలా చంపేస్తారు?: దిశ ఎన్​కౌంటర్​పై మేనక

ABOUT THE AUTHOR

...view details